Latest News

రాష్ట్రం మొత్తం తిరగనున్న పవన్ కల్యాణ్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు పూనుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన యాత్రకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి జనసేన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు చెబుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను విశ్లేషిస్తారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రయాణం ప్రారంభించేందుకు జన సేనాపతి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధితోపాటు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సరిచేసే ప్రయత్నం, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఊపిరి ఆగిపోతున్న ఉద్దానం ప్రజలకు అండగా నిలవాలన్న అజెండాతో సిక్కోల్‌కు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.